39. ప్రశ్న : మోషే, ఏలియా, హానోకు వీళ్ళు ముగ్గురు పరలోకంలో ఉన్నారు గద సార్. మిగతా వాళ్ళందరు పరదైసులో ఉన్నారని బైబిల్ వాక్యంలో తెలుసుకున్నాను. అయితే ఇప్పుడు యేసుప్రభు మరణించినప్పుడు అనేకమంది సమాధులనుంచి వచ్చారని చెప్పారు కద సార్. అక్కడ అయితే వారనేకులకు కనబడి తరువాత కనబడలేదని అక్కడ వ్రాయబడింది. అయితే వాళ్ళు కూడా పరలోకంలో ఉంటారా లేదంటే పరదైసులో ఉంటారా సార్?